ఘనంగా మిలటరీ ఇంజినీరింగ్ కాలేజీ 107వ వార్షికోత్సవం

ఘనంగా మిలటరీ ఇంజినీరింగ్ కాలేజీ 107వ వార్షికోత్సవం

 

  • కొత్త ఆవిష్కరణలతో ముందుకెళ్లాలి
  • ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌‌‌‌మెంట్  డైరెక్టర్ ప్రొఫెసర్ హిమాన్షు రాయ్ 
  • 43 మందికి బీటెక్, డిగ్రీ పట్టాలు ప్రదానం


పద్మారావునగర్, వెలుగు: వ్యక్తిత్వం, ఎథికల్ లీడర్ షిప్​, మేథో చురుకుదనం అనే అంశాలు ప్రతి వ్యక్తిలో డిసిప్లేన్​, హెల్పింగ్​ నేచర్​ను పెంపొందిస్తాయని ఇండోర్ లోని ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌‌‌‌మెంట్  డైరెక్టర్ ప్రొఫెసర్ హిమాన్షు రాయ్ అన్నారు. 

గురువారం సికింద్రాబాద్‌‌‌‌ కంటోన్మెంట్ లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ 107వ స్నాతకోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. దేశానికి జ్ఞానం, ధైర్యంతో సేవలు అందిస్తూ నూతన ఆవిష్కరణలతో మరింత ముందుకు వెళ్లాలన్నారు.

 ఎంసీఈఎంసీ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్షనీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నదని, భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో ఏఐ, డ్రోన్స్ రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్  కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం కాలేజీలో బీటెక్ పూర్తిచేసిన 43 మంది మిలటరీ గ్రాడ్యుయేట్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

 ఉత్తమ ఆల్ రౌండ్ స్టూడెంట్ ఆఫీసర్‌‌‌‌గా లెఫ్టినెంట్ డి.సుభాష్  గోల్డ్ మెడల్ ట్రోఫీని అందుకున్నారు. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో వరుసగా మొదటి స్థానం సాధించినందుకు లెఫ్టినెంట్ అభినవ్ నాయర్ , లెఫ్టినెంట్ ఆదర్శ్ కుమార్ సింగ్‌‌‌‌లకు కమాండెంట్ సిల్వర్ మెడల్ లభించింది. స్నాతకోత్సవం తర్వాత పలు సాంకేతిక ప్రాజెక్టులను ప్రదర్శించగా అతిథులను ఆకట్టుకున్నాయి.