రేవంత్, బండి తుపాకీ రాముడిలా మాట్లాడుతుండ్రు : మంత్రి ఎర్రబెల్లి 

రేవంత్, బండి తుపాకీ రాముడిలా మాట్లాడుతుండ్రు : మంత్రి ఎర్రబెల్లి 

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ తుపాకీరాముడిలా మాట్లాడుతూ తీరుగుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. వాళ్ళ మాటలు వినడానికి వినసొంపుగా వున్నా ఎందుకు పనికిరారని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి,బండి సంజయ్ లు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని.. అకారణంగా తమ నేతలు కేసీఆర్, కేటీఆర్ లను ఆడి పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఇంటిముందు పిచ్చికుక్కలు మొరిగినట్లుగా మొరుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఈ పిచ్చి కుక్కలకు గుణపాఠం చెప్పాలని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు అమలు జరుగుతున్నాయా.. ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.