తెలంగాణపై బీజేపీ నిజస్వరూపం బయటపడింది

తెలంగాణపై బీజేపీ నిజస్వరూపం బయటపడింది

రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజ్యసభ వేదికగా బీజేపీ నిజస్వరూపం బయటపడిందన్నారు. తెలంగాణ పై కక్షసాధింపు గా మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  తెలంగాణపై కుట్రలు చేస్తున్న బీజేపీ నాయకులను గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు నిలదీయాలన్నారు. కేసిఆర్ దీక్ష, అనేకమంది ఆత్మబలిదానాలతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు కావొస్తున్నా విభజన హామీలు ఇంకా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన అధికారాలను సరిగ్గా అమలు చేయడం లేదని..అందుకే కేసీఆర్ కొన్ని సవరణలు చేయాలని మాత్రమే కోరారని చెప్పారు. కేసీఆర్ బతికున్నంతకాలం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. 

తెలంగాణలో రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు

రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని అవమానపర్చచడమే అవుతుందన్నారు. రాజకీయ విద్వేషాలు తెలంగాణలో పనిచేయవని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

 

పుష్కర్ ధామి ఫ్లవర్ భీ హై ఔర్ ఫైర్ భీ హై

కంపెనీల్లో కొత్త కొలువుల జోరు