ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి కేటీఆర్ కృషి చేస్తున్నరు

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి కేటీఆర్ కృషి చేస్తున్నరు

స్టేషన్​ఘన్​పూర్/పాలకుర్తి, వెలుగు: రాష్ట్రానికి కాబోయే సీఎం కేటీఆర్​ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. మంత్రి కేటీఆర్​బర్త్​డే సందర్భంగా జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్​శివారులో నేషనల్​ హైవే(163) పక్కన  ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ ​జిల్లాను ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చేసేందుకు మంత్రి కేటీఆర్​ కృషి చేస్తున్నారన్నారు. ఐటీ, టెక్స్​టైల్​పార్క్​ ఏర్పాటు చేశారన్నారు. కేటీఆర్ కాలుకు దెబ్బ తగిలి స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఆయన సత్వరమే కోలుకోవాలని భగవంతుడిని కోరుకుందామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య, జడ్పీ చైర్మన్​ పాగాల సంపత్​రెడ్డి, కుడా చైర్మన్​ సుందర్​రాజ్ ​తదితరులు పాల్గొన్నారు​.