హిందూ ధర్మాన్ని కాపాడే నిజమైన వ్యక్తి కేసీఆర్ : గంగుల

హిందూ ధర్మాన్ని కాపాడే నిజమైన వ్యక్తి  కేసీఆర్ : గంగుల

బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి ఆర్వింద్ లు ఎన్నికల కోసమే దేవుళ్లను వాడుకుంటారని మంత్రి గంగుల కమాలకర్ ఆరోపించారు. నిజంగా ధర్మాన్ని కాపాడే వాళ్లే అయితే కొండగట్టుకు అభివృద్ధికి వంద కోట్ల నిధులు తేవాలని సవాల్ విసిరారు.  రేపు సీఎం  కేసీఆర్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి గంగుల దగ్గరుండి పరిశీలించారు. కొండగట్టు దేవాలయానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తోన్న కేసీఆర్ అసలైన హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తి అన్నారు. బీజేపీ ఎంపీలైన సంజయ్, ఆర్వింద్ లు రాజకీయాల కోసం రాముడిని వాడుకుని గెలిచారని విమర్శించారు. ఇప్పటివరకూ వారు రాష్ట్రంలోని ఏ దేవాలయానికి కూడా రూపాయి నిధులు తేలేదన్నారు.  గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ మరింత తగ్గిందన్న గంగుల.. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు.