
సిద్దిపేట, వెలుగు : దాదాపు రూ.20లక్షల విలువైన డబుల్బెడ్రూం ఇండ్లను ఫ్రీగా ఇస్తున్నామని, వాటిని ఎవరు అమ్మినా, కిరాయిలకు ఇచ్చినా వాపస్ తీసుకుంటామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సోమవారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్ లో 300 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట టౌన్లోని కేసీఆర్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం అర్హులైన 1500 మందికి ఇదివరకే పట్టాలు పంపిణీ చేశామన్నారు. త్వరలోనే అందరితో కలిసి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహిస్తామన్నారు. సిద్దిపేట టౌన్లోని పేదల కోసం త్వరలోనే మరో వెయ్యి ఇండ్లు కట్టిస్తామన్నారు. సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సహకారం అందజేస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ పాల్గొన్నారు.