బండి సంజయ్, రేవంత్ రెడ్డి పాదయాత్రలు విడ్డూరం

బండి సంజయ్, రేవంత్ రెడ్డి పాదయాత్రలు విడ్డూరం

తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ ఒకవైపు, రేవంత్ రెడ్డి మరోవైపు పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పందిల్ల గ్రామంలో పర్యటించిన మంత్రి .. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ లలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాలన ఉన్నప్పటికీ కనీసం వడ్లు కొనే పరిస్థితి లేదని అన్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా.. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల మాతాశిశు ఆస్పత్రిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె ఆసుపత్రులుగా త్వరలో అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. ఈ నెల 12న గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు. అటు పందిల్లలో వాసవి నిత్యాన్నదానసత్రానికి తన ఒక్క నెల వేతనాన్ని అందిస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు.