ఇరిగేషన్ పనుల్లో వేగం పెంచండి

ఇరిగేషన్ పనుల్లో వేగం పెంచండి

నిర్మల్, వెలుగు:  నిర్మల్ జిల్లాలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పై  ప్రత్యేక దృష్టి  పెట్టాలని  మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలేశ్వ రం ప్యాకేజీ నంబర్ 27, 28 పనులతో పాటు భూసేకరణ, నష్టపరిహా రం పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు.  

ప్యాకేజీ నెంబర్ 28 హై లెవెల్ కాలువ పనులకు సంబంధించి  చర్యలు తీసుకో వాలన్నారు. పాత కాంట్రాక్టు రద్దుచేసి కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్ప జెప్పనునట్లు తెలిపారు.  సమావేశంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు 
పాల్గొన్నారు.