అమిత్ షా చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు

అమిత్ షా  చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు

నల్గొండ: ప్రజా సంగ్రామ యాత్రలో  కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై అమిత్ షా చేసిన కామెంట్స్ దిగజారుడు తనానికి నిదర్శమన్నారు. తన ప్రసంగంలో షా ఒక్కమాట కూడా రాష్ట్రానికి ఉపయోగపడేలా మాట్లడలేదన్నారు. సీఎం కేసీఆర్ ను చూస్తే కేంద్రానికి వణుకుపుడతోందన్నా ఆయన... కేసీఆర్ ను ఎదుర్కొనే శక్తి దేశంలో ఎవరికీ లేదన్నారు. అందుకే కేసీఆర్ ఇమేజ్ ను దెబ్బతీయడానికి ప్రతి పక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బండి సంజయ్ కొంగ జపానికి రాష్ట్ర ప్రజలు మోసపోయే పరిస్థితి లేదని, బీజేపీ ఎన్ని కుతంత్రాలు పన్నినా... తమకొచ్చే నష్టం ఏంలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు జాతీయ నాయకులను తీసుకొచ్చి సభల పేరుతో డ్రామాలాడుతున్నారన్నారు. కానీ అవేమీ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరని కొట్టిపారేశారు. కేసీఆర్ మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, మళ్లీ తమదే అధికారమని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

సార్ పాస్ చేయండి.. లేకపోతే పెళ్లి చేస్తారు.. విద్యార్థుల వింత కోరికలు

క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వరకూ కాంగ్రెస్ పాద‌యాత్ర