మంత్రి మీద కోపం.. గడియారాలపై!

మంత్రి మీద కోపం.. గడియారాలపై!

సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్ రెడ్డికి టైమ్ కలిసి రావట్లేదనే చర్చ జోరుగా జరుగుతున్నది. కొన్ని రోజులుగా జగదీశ్ రెడ్డి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా సుమారు 50వేల గోడ గడియారాలు పంచారు. గడియారంపై ఆయనతో పాటు కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ట్యాంక్ బండ్ ఫొటోలు ఉన్నాయి. 

ప్రభుత్వ పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు, పార్టీ కేడర్, అనుచరులకు జగదీశ్​రెడ్డి ఇప్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నియోజకవర్గ ప్రజలంతా మంత్రిపై గుర్రుగా ఉన్నారు. దళిత బంధు, గృహలక్ష్మి, డబుల్ బెడ్రూమ్ రాలేదంటూ ప్రతి గ్రామంలో జనం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. 

ఈ క్రమంలో పలువురు బాధితులు మంత్రి మీద ఉన్న కోపాన్ని.. ఆయన ఇచ్చిన గడియారాలపై చూపిస్తున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ తన అనుచరులకు ఇప్పించుకుని.. వంద రూపాయల గడియారాలు మాకెందుకు ఇచ్చినట్లు అంటూ రోడ్లపై వేసి పగులగొడ్తూ గుస్సా అయితున్నరు.