మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం

మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం
  • విద్యుత్ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణలో మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు : తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖలో ఉద్యోగుల న్యాయ‌‌‌‌‌‌‌‌మైన సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి జూప‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు అన్నారు. మంగ‌‌‌‌‌‌‌‌ళ‌‌‌‌‌‌‌‌వారం నెక్లెస్‌‌‌‌‌‌‌‌రోడ్‌‌‌‌‌‌‌‌లోని డాక్టర్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ స్మృతివనం వ‌‌‌‌‌‌‌‌ద్ద తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండ‌‌‌‌‌‌‌‌ర్ ను  మాజీ ఎంపీ మల్లు రవితో క‌‌‌‌‌‌‌‌లిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సంద‌‌‌‌‌‌‌‌ర్భంగా మంత్రి జూప‌‌‌‌‌‌‌‌ల్లి మాట్లాడారు.

ఎన్నో ఆశలతో అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ప్రజ‌‌‌‌‌‌‌‌ల ఆశ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా జరగలేదని విమర్శించారు. ఈ  ప‌‌‌‌‌‌‌‌దేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై  రూ.7 ల‌‌‌‌‌‌‌‌క్షల కోట్ల అప్పుల భారం మోపిందని మండిపడ్డారు.  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఇచ్చిన హ‌‌‌‌‌‌‌‌మీల‌‌‌‌‌‌‌‌ను కచ్చితంగా నెర‌‌‌‌‌‌‌‌వేరుస్తుందని తెలిపారు.