మంత్రి కొండా సురేఖకు స్వల్ప అస్వస్థత

మంత్రి కొండా సురేఖకు  స్వల్ప అస్వస్థత

హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖ గురువారం స్వల్ప అస్వస్థత గురయ్యారు. మంత్రివర్గ సమావేశం కోసం సెక్రటేరియెట్​కు వచ్చిన మంత్రి సురేఖ.. తన చాంబర్​లోనే స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత  కోలుకున్నారు. 

విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖ చాంబర్​కు వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.  ఒక‌టి, రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని వైద్యులు సీఎంకు చెప్పగా..ఆరోగ్యం ప‌ట్ల జాగ్రత్త తీసుకోవాల‌ని, ఇంటికి  వెళ్లి రెస్టు తీసుకోవాల‌ని మంత్రి సురేఖకు  సీఎం సూచించారు.