ప్రభుత్వ కాలేజీల అభివృద్ధే లక్ష్యం : మంత్రి కొండా సురేఖ

ప్రభుత్వ కాలేజీల అభివృద్ధే లక్ష్యం : మంత్రి కొండా సురేఖ

కాశీబుగ్గ/ వరంగల్​ సిటీ, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ర్ట ప్రభుత్వం పని చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం సిటీలోని 27వ డివిజన్​లోని కృష్ణకాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్​కాలేజీ భవన నిర్మాణానికి మంత్రి బల్దియా మేయర్ గుండు సుధారాణి, వరంగల్​ కలెక్టర్ సత్య శారదతో కలిసి భూమిపూజ చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎస్ఆర్ నిధులు రూ.5 కోట్లతో పాటు అరబిందో ఫార్మా కంపెనీ వారి సహకారంతో ప్రభుత్వ బాలికల జూనియర్​ కాలేజీ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతాకుల అనీల్ కుమార్, కావేటి కవిత, బస్వరాజు కుమార్, సురేశ్​ జోషి, అరబిందో ఫార్మా డైరెక్టర్ సందానందం రెడ్డి, డీఈవో జ్ఞానేశ్వర్, జిల్లా ఇంటర్మీడియట్​ అధికారి శ్రీధర్​సుమన్, కాలేజ్​ ప్రిన్సిపల్​ శరధృతి  పాల్గొన్నారు.