
- కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: తిరుమల వేంకటేశ్వర స్వామిని మంగళవారం ఉదయం మంత్రి కొండా సురేఖ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికా రులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు. అనంతరం మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడారు. మనమడి పుట్టు వెంట్రుకలు శ్రీవారికి సమర్పించామన్నారు. తన వివాహం కూడా తిరుమలలో జరగడం తన అదృష్టమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై స్వామివారి కృప ఉండాలని ప్రార్థించినట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.