- ఇంతవరకు ఎవరూ అట్ల హ్యాట్రిక్ కొట్టలే
- కేసీఆర్ మాత్రం సరికొత్త రికార్డు సృష్టిస్తరు: కేటీఆర్
- ధీమా వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్
- కామారెడ్డిలో ఇండోర్ స్టేడియం పనులకు శంకుస్థాపన
కామారెడ్డి, వెలుగు: దక్షిణ భారతదేశంలోనే హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సౌత్ ఇండియా నుంచి ఎంజీఆర్, ఎన్టీఆర్, కరుణానిధి లాంటి పెద్దలు సీఎంలుగా ఉన్నా ఎవరూ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి కాలేదని అన్నారు. అయితే.. కేసీఆర్ మాత్రం హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టిస్తారని, దానికి కామారెడ్డి వేదిక అవుతుండటం గర్వకారణమని చెప్పారు. ఈసారి కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయనుండటంతో శనివారం కామారెడ్డిలో కార్యకర్తల మీటింగ్ఏర్పాటు చేశారు. రూ. 8 కోట్లతో నిర్మించనున్న ఇండోర్స్టేడియం పనులకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ ఎక్కడ అడుగు పెట్టిన విజయం సాధించారు. కామారెడ్డి నుంచి కేసీఆర్పోటీ
చేస్తానని ప్రకటించిన మరుక్షణమే ఆయన గెలుపు ఖాయమైంది.
దేశ చరిత్రలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఏ నేతకు రానంత మెజార్టీని కామారెడ్డిలో కేసీఆర్కు అందించాలి. గంప గోవర్ధన్కు ఎమ్మెల్యే కంటే పెద్ద హోదా దక్కవచ్చు” అని అన్నారు. ఎమ్మెల్యేల టికెట్ల విషయంలో రాజకీయ సమీకరణాల వల్ల ముదిరాజ్లకు అన్యాయం జరిగిందని, ప్రాతినిధ్యం విషయంలో వచ్చిన గ్యాప్ను సవరించుకుంటామన్నారు. ముదిరాజ్సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాశ్మండలిలో డిప్యూటీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యేలుగా అవకాశం రాని ముదిరాజ్లకు, ఇతర కమ్యూనిటీలకు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో తప్పకుండా అవకాశం కల్పిస్తామన్నారు. కామారెడ్డిలో ముదిరాజ్ భవన్కు రూ. 2 కోట్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్పారు.
బీజేపీలోకి రేవంత్ జంపైతడు
కాంగ్రెస్ నుంచి 10 , 12 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే రేవంత్రెడ్డి బీజేపీలోకి జంపు అవుతారని కేటీఆర్ ఆరోపించారు. ‘‘రేవంత్రెడ్డిని గాంధీ భవన్లో కూర్చోబెట్టింది ఆర్ఎస్ఎస్, బీజేపీవాళ్లే. వీరి మధ్య తేరచాటు, చీకటి ఒప్పందం ఉంది. కాంగ్రెస్ చచ్చిన పీనుగు.. దానికి దింపుడు కల్లం ఆశ ఉంది. కాంగ్రెస్, బీజేపీ వాళ్లను తక్కువ అంచనా వేయొద్దు. కేసీఆర్ లాంటి నాయకుడు ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్రెడ్డితో, రాష్ట్ర ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్రెడ్డితో పోరాడాల్సి వస్తున్నది. రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి ఉద్యమ ద్రోహులు” అని ఆయన దుయ్యబట్టారు.
కామారెడ్డిలో గ్రామానికో మేనిఫెస్టో
కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామానికి ఓ మేనిఫెస్టో తయారు చేయాలని లీడర్లకు కేటీఆర్ సూచించారు. ‘‘సీఎం నియోజకవర్గమంటే మజాక్ కాదు. నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తం. ఏ గ్రామానికి ఏం కావాల్నో నాకు ఇవ్వండి. నేను, గోవర్దన్, ప్రశాంత్రెడ్డి బాధ్యత తీసుకొని ఆ పనులు చేస్తం” అని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో 266 బూత్ల్లో ఒక్కోదానికి ఒక్కో సీనియర్లీడర్ను ఇన్చార్జ్గా నియమిస్తామని చెప్పారు. బూత్ కమిటీలు వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. మెజార్టీ కోసం ఏ బూత్కు ఆ బూత్పోటీ పడాలన్నారు. కామారెడ్డికి తనతో పాటు మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ఇన్చార్జ్గా ఉంటారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ఏం జరగబోతున్నదని మహారాష్ట్ర చూస్తున్నదని ఆయన అన్నారు. ‘‘తెలంగాణలో గెలవాలి. రేపు మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్పాగా వేయాలి. ఆ తర్వాత జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలి. తెలంగాణలో మనం గెలిస్తేనే మహారాష్ట్రలో గెలవడానికి వీలుంటుంది. మహారాష్ట్రకు చెందిన చాలా మంది సిట్టింగ్ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు బీఆర్ఎస్లో చేరడానికి రెడీగా ఉన్నరు. ఇక్కడి 24 గంటల కరెంట్, రైతుబంధు, దళిత బంధు స్కీమ్ల దృష్ట్యా మన వైపు మహారాష్ట్ర చూస్తున్నది” అని తెలిపారు.