కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ కేరాఫ్ గా మారిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఫుడ్ప్రాసెసింగ్, ఎక్స్ పోర్ట్ రిటైల్ రంగంలో పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ సంస్థ లులూ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కంపెనీ చేపట్టబోయే పనులను వివరించనుంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిదని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. పరిశ్రమల స్థాపనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయని వెల్లడించారు. లులూ గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వివరించారు. దావోస్ లో చేసుకున్న ఒప్పందం మేరకు కంపెనీ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు వివరించారు.