జహీరాబాద్ లో ఎంజీ ఈవీ పార్క్ ప్రారంభించిన కేటీఆర్

జహీరాబాద్ లో ఎంజీ ఈవీ పార్క్ ప్రారంభించిన కేటీఆర్

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ రంగం శరవేగంగా విస్తరిస్తోందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎంజీ ఈవీ పార్క్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్లోబల్ వార్మింగ్ ఫలితాలు ప్రస్తుతం అనుభవిస్తున్నామన్నారు. ‘నిమ్జ్’ లో చాలా ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. ఉపాధి కల్పన కోసమే పరిశ్రమలకు రాయితీలు ఇస్తున్నామన్న మంత్రి.. స్థానికులకు ఉపాధిలో ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీలకు సూచించారు. అబ్దుల్ కలాం పేరుతో జహీరాబాద్ లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు పలు రంగాల్లో  శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రైతులను సంతృప్తిపరిచిన తర్వాతే ప్రభుత్వం భూమిని సేకరిస్తుందని.. భూములు కోల్పోయిన వారి పిల్లలకు నిమ్జ్ లోనే ఉద్యోగాలు ఇచ్చేలా ప్లాన్ చెస్తామని చెప్పారు.