
హైదరాబాద్ : సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పురపాలక శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ భాగస్వాములయ్యారు. ఇందులో భాగంగా.. ప్రగతిభవన్ లోని గార్డెన్ లో పూల కుండీలు, వివిధ పాత్రల్లో నిండిన నీటిని శుభ్రపరచారు. ఎక్కడైనా వాన నీరు పేరుకుపోయిందేమోనని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిరంతరం పది వారాల పాటు కొనసాగించాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు ఇంటి శుభ్రత కోసం సమయం కేటాయిస్తే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టడానికి వీలవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీజనల్ వ్యాధుల ను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కలిసి రావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు.
MA&UD Minister @KTRTRS participated in #10MinsAt10AM program at Pragathi Bhavan. This weekly initiative is aimed at reducing mosquito breeding to prevent spread of seasonal diseases. pic.twitter.com/jNNtCxfwMk
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 24, 2020