బండి సంజయ్కు కేటీఆర్ ఘాటు రిప్లై

బండి సంజయ్కు కేటీఆర్ ఘాటు రిప్లై

‘‘కేసీఆర్.. నువ్వు చేసిన అవినీతికి నీ మీద కూడా కేసులు పెట్టడం గ్యారంటీ.. రేపు నువ్వు కూడా ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉంటది.. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను రూ.30వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచారు’’ అంటూ  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్లపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానే కాదు.. ఈడీ సారథిగా కూడా నియమించినందుకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే గుర్తుకొస్తోంది.. నిజానికి ఈ దేశాన్ని నడిపే డబుల్ ఇంజన్  "మోడీ & ఈడీ" అని ఇప్పుడే మేము గ్రహించాము.. అని ఎద్దేవా చేశారు.