వరంగల్​లో నియో మెట్రో పరుగులు పెట్టిస్తం:మంత్రి కేటీఆర్

వరంగల్​లో నియో మెట్రో పరుగులు పెట్టిస్తం:మంత్రి కేటీఆర్
  • బీఆర్ఎస్​లో చేరిన రాకేశ్​రెడ్డి, మాదాసు వెంకటేశ్, బక్క నాగరాజు

హైదరాబాద్, వెలుగు: వరంగల్​లో నియో మెట్రో పరుగులు పెట్టిస్తామని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ​అన్నారు. వరంగల్​కు పలు ఐటీ కంపెనీ లను తెచ్చామని, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు. శనివారం తెలంగాణ భవన్​లో ఉమ్మడి వరంగల్ ​జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఏనుగుల రాకేశ్​రెడ్డి,మాదాసు వెంకటేశ్, బక్కనాగరాజు యాదవ్​ బీఆర్ఎస్​లో చేరారు.వారికి కేటీఆర్​ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్​పార్టీ కనీసం కరెంట్, నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. మన తెలంగాణను మనమే పాలించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏం చేయాలన్నా ఢిల్లీకి పోవాల్సిందేనని, మన హైకమాండ్ ​రాష్ట్రంలోని ప్రజలేనని తెలిపారు. పార్టీలో చేరిన నేతలంతా బీఆర్ఎస్​ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. 

కేసీఆర్ పాలనలో సురక్షితంగా ఉన్నామని ఆడబిడ్డలు చెబుతున్నారని తెలిపారు.  దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణను నంబర్​వన్​గా నిలిపామని, అనేక ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్​లో పెట్టుబడులు పెడుతున్నాయని.. ప్రగతిని ఇలాగే కొనసాగించుకుందామని కోరారు. 

బీఆర్ఎస్ ​అధికారం కోసం కృషి: రాకేశ్​రెడ్డి

రాకేశ్​రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్​ తెలంగాణవాదానికి రూపురేఖలు ఇచ్చిన నాయకుడని, ఆయన పిలుపుతో తెలంగాణ మొత్తం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిం చిందన్నారు. మంత్రి కేటీఆర్​ మంచి విజన్​తో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, ఆయన తెలంగాణ భవిష్యత్ ​నిర్మాత అని అన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్​ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్​రెడ్డి, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​తదితరులు పాల్గొన్నారు.