మీరు బీజేపీ కాదు.. అసెంబ్లీలో రాజాసింగ్ పై కేటీఆర్ సెటైర్లు

మీరు బీజేపీ కాదు.. అసెంబ్లీలో రాజాసింగ్ పై కేటీఆర్ సెటైర్లు

ప్రతిపక్ష సభ్యులకు అసెంబ్లీలో 30 నిముషాలు కూడా కూర్చునే  టైం లేదన్నారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన కేటీఆర్.. బీజేపీ సభ్యులు 30 రోజులు సమావేశాలు జరపాలని.. 20 రోజులు సభ నడపాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. కానీ తీరా సమావేశాలు ప్రారంభమైతే ఒక్కరు కూడా  రాలేదన్నారు.  బీజేపీ నుంచి ఒకరు ..కాంగ్రెస్ నుంచి ఇద్దరు మాత్రమే  హాజరయ్యారన్నారు. మీరు బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు మీకు తెల్వదా అని రాజాసింగ్ నుద్దేశించి అన్నారు కేటీఆర్.

ప్రతిపక్ష సభ్యులకు సభలో 30 నిముషాలు కూర్చునే  ఒపిక కూడా లేదు కానీ  30 రోజులు  సభ పెట్టాలంటారని ఎద్దేవా చేశారు.  తెలంగాణ వచ్చాక 35 ప్రాజెక్టులు పూర్తి చేశామని.. ఇదే కేసీఆర్ పనితీరుకు నిదర్శనమని అన్నారు. మోడీ అసమర్థతకు, చేతకాని తనానికి  ఉప్పల్, అంబర్ పేట  ఫ్లైఓవర్ పని తీరే నిదర్శనమన్నారు.