ఎన్నికల సమయంలో పార్టీలు మారడం సహజం

ఎన్నికల సమయంలో పార్టీలు మారడం సహజం

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నవంబర్ 28న ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని ఆయన అన్నారు. ‘నవంబర్ 28న ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుంది. జీహెచ్ఎంసీకి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది సీఎం కేసీఆర్ సభలో వివరిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలందరూ ఈ సభకు రావాలి. కోవిడ్ నియమాలకు లోబడి సభ ఉంటుంది. అందరికి శానిటైజర్లు, మాస్కులు ఇస్తాం. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను కేసీఆర్ వివరిస్తారు. హైదరాబాద్‌లో చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకోం. ఓ పిచ్చోడు సమాధులు కూలుస్తాం అంటాడు. మరొక పిచ్చోడు జనాలను, బండ్లను రాంగ్‌రూట్‌లో వెళ్ళండి అంటాడు. హైదరాబాద్‌లో మతం, కులం పేరుతో చిచ్చు పెడుతామంటే ఊరుకోం. ఎంఐఎం, బీజేపీలే కాదు ఏ పార్టీ అల్లర్లు చేసినా ఊరుకోం. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేస్తారు. ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వెళ్లడం సహజం’ అని ఆయన అన్నారు.

For More News..

కమీషన్లన్నీ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పోతున్నాయి

20 ఏళ్ల యువతిని అడవిలో బంధించి 14 రోజలపాటు అత్యాచారం

బోట్ ఫ్యూయల్ ట్యాంకులో డ్రగ్స్ రవాణా