సింగరేణిపై కేంద్రం కుట్రను భగ్నం చేస్తం: కేటీఆర్

సింగరేణిపై కేంద్రం కుట్రను భగ్నం చేస్తం: కేటీఆర్

సింగరేణిని కుట్రపూరితంగా ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం కుట్రను భగ్నం చేస్తామని, అవసరమైతే సింగరేణి కార్మికులతో పాటు రాజకీయపక్షాలను కలుపుకుని ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణిని కాపాడుకునేందుకు ఎవరితోనైనా కొట్లాడేందుకు సిద్దమని కేటీఆర్ ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఇసుక పాలసీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. బయ్యారం ఉక్కుపై ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.  

సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్మీ జోన్ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం.. కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని విమర్శించారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్ పెేట్ వరకు స్కైవే నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్దంగా ఉన్నాయని.. కాని కేంద్రం దీనికి అనుమతించడం లేదని చెప్పారు. ఇక మతపరమైన అడ్డంకులు ఉన్న రోడ్ల నిర్మాణం కోసం కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో ఉన్నామని కేటీఆర్ వివరించారు.