హుజురాబాద్ లో పోటీ వ్యక్తుల మధ్య కాదు.. పార్టీల మధ్యే

హుజురాబాద్ లో పోటీ వ్యక్తుల మధ్య కాదు.. పార్టీల మధ్యే

హైదరాబాద్: హుజురాబాద్ లో పోటీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మద్యే కానీ.. వ్యక్తుల మధ్య కాదన్నారు మంత్రి కేటీఆర్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అన్నారు. నియోజక వర్గానికి బీజేపీ ఏమి చేసిందో ఈటల చెప్పాలన్నారు. ఈ సీజన్లో అందరు  వ్రతాలు పూజలు చేసినట్టు షర్మిలా ఓ రోజు పెట్టుకుని వచ్చిపోతుంటారన్నారు. వచ్చే రెండు.. మూడు నెలలు రాజకీయాలు రంజుగా ఉంటాయని..ఏపీ జలవివాదాలపై  సుఫ్రీంకోర్టుకు వెల్లినా న్యాయం తెలంగాణ వైపే ఉందన్నారు. తెలంగాణలో ఉద్యోగాల ఇష్యూ క్లీయరైతే.. ప్రతిపక్షాలకు విమర్శించే టాపిక్ ఉండదన్నారు మంత్రి కేటీఆర్.