
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు కరోనా సోకింది. తనకు కరోనా సోకినట్లుగా ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం స్వల్పంగా కరోనా లక్షణాలున్నాయని ఆయన తెలిపారు. ఇంట్లోనే హోంఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. తనను కొన్ని రోజల నుంచి కలుస్తున్న వారందరూ టెస్టులు చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం స్వల్పంగా కరోనా లక్షణాలున్నాయి. ఇంట్లోనే హోంఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. కొన్ని రోజుల నుంచి నన్ను కలిసినవారందరూ టెస్టులు చేయించుకొని జాగ్రత్తగా ఉండండి’ అని ఆయన ట్వీట్ చేశారు.
I’ve tested COVID positive with mild symptoms. Currently isolated at home
— KTR (@KTRTRS) April 23, 2021
Those of you who have met me last few days, kindly follow the covid protocol, get tested & take care