ఆడిపాడిన  మల్లారెడ్డి

ఆడిపాడిన  మల్లారెడ్డి

శామీర్ పేట: మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలో నిర్వహించిన రైతు దినోత్సవ సంబురాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించగా.. మండలంలోని తండాల నుంచి వచ్చిన లంబాడీలతో కలిసి మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్​ చేశారు.  అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్ అమోయ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.