రియాల్టర్ కు మంత్రి మల్లారెడ్డి వార్నింగ్

రియాల్టర్ కు మంత్రి మల్లారెడ్డి వార్నింగ్

మేడ్చల్ జిల్లా : వెంచర్ అనుమతి విషయంలో మంత్రి మల్లారెడ్డి ఓ రియల్టర్ ను బెదిరించినట్టు ఆడియో వైరల్ అవుతోంది. మేడ్చల్ జిల్లాలో ఓ వెంచర్ వేసిన రియల్టర్ కు చెందిన మధ్యవర్తితో మంత్రి ఫోన్ మాట్లాడుతూ..వెంచర్ కు సంబంధించిన వ్యవహారంలో సర్పంచ్ కు ఇస్తే సరిపోతుందా అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రి ఉన్నారంటూ రియల్టర్ ను మల్లారెడ్డి బెదిరించిన ఆడియో హాట్ టాఫిక్ అవుతోంది. గతేడాది మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైన సంగతి తెలిసిందే. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంలో తన భూమిని కబ్జా చేయించారని శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంత్రి అనుచరులు తన స్థలంలో ప్రహారీగోడ నిర్మించారని, తన లాయర్ కూడా మంత్రితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వారు తప్పుడు అగ్రిమెంట్ సృష్టించాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. దీంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే.