కేంద్రానికి మద్దతుగా ధర్నా.. ఇదేందే మల్లన్న

కేంద్రానికి  మద్దతుగా ధర్నా.. ఇదేందే మల్లన్న

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ  ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.  ఇందులో భాగంగానే మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి అనుచరులు పెట్టిన ప్లెక్సీలు హాట్ టాఫిక్ గా మారాయి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు మద్దతుగా అంటూ ప్లెక్సీల్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది.

వాస్తవానికి కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నా చేస్తుంటే..అందుకు మల్లారెడ్డి మద్దతు తెలుపుతున్నట్లు ఫ్లెక్సీల్లో రాయించారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే  కొన్ని గంటల తర్వాత ప్లెక్సీల్లో తప్పును గ్రహించిన మంత్రి అనుచరులు వాటిని తొలగించారు. అయినా ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.