ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ : శ్రీనివాస్ గౌడ్

ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ :  శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు :  అధికారంలోకి రావడానికి అలవిగాని హామీలతో  ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతోందని మంత్రి  శ్రీనివాస్ గౌడ్  అన్నారు.  రూరల్ మండలం తువ్వగడ్డ తండాలో  వివిధ అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ చేశారు.  సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం మంత్రి  మాట్లాడుతూ గతంలో, ఇప్పుడు జరగుతున్న అభివృద్ధిలో తేడాను గమనించాలని కోరారు.

ALSO READ  : రాష్ట్రంలో వైద్య విప్లవం .. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నం: హరీశ్ రావు

కార్యక్రమంలో రాష్ట్ర కన్జ్యూమర్ ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, లైబ్రరీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, రైతుబంధు  డైరెక్టర్ నరసింహారెడ్డి, ఎంపీపీ సుధాశ్రీ, జడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ ,  పార్టీ మండల  అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్  తదితరులు ఉన్నారు.