
జనగామ జిల్లా పాలకుర్తిలో మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ధరణి-భూభారతి కి నాగలోకానికి నక్కకు ఉన్న తేడా ఉందని.. భూ భారతి తో రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా నడుస్తున్నామని అన్నారు.రేపటి ( జూన్ 3 ) నుంచి గ్రామాల్లోకే అధికారులు వస్తారని.. అధికారులే అప్లికేషన్లు కూడా ఇస్తారని.. ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దని అన్నారు పొంగులేటి. గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చేస్తామని.. గ్రామాల్లోనే భూసమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఆగస్టు 15 నాటికి భూసమస్యలు లేకుండా చర్యలు చేపడతామని అన్నారు.
రాష్ట్రంలో అన్ని మండలలకు ట్రైనింగ్ ఇచ్చిన సర్వేయార్ల తో సర్వే జరుగుతుందని.. వెయ్యి మందికి తగ్గకుండా ప్రభుత్వ సర్వేయర్లు ఉంటారని అన్నారు పొంగులేటి .ప్రతి సోమవారం ఏ మేరకు నిర్మాణమైన ఇందిరమ్మ ఇళ్లు బిల్లు ప్రభుత్వం ఇస్తుందని.. ఇళ్లు రాలేదని ఎవరు ఆందోళన నిరుత్సాహపడవద్దు.. నిరంతరంగా ఇండ్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. నిరుపేదైన ప్రతి ఒకరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని.. రాజీవ్ యువ వికాసంకు ఎవరు ఊహించని విధంగా అప్లికేషన్లు వచ్చాయని అన్నారు. రాజీవ్ యువ వికాసంలో అక్రమాలు జరగవద్దని కొంత ఆలస్యం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో సచ్చిన పాములు తోక జడిచ్చే పనులు చేస్తే ఈ ప్రభుత్వంలో సాగవని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలతో రెండు మూడు పర్యాయాలు ఇంతకుముందే చర్చించచామని.. జూన్ 5న జరిగే క్యాబినెట్ సమావేశం లో ఈ సబ్జెక్టు కూడా ఉంటుందని అన్నారు