నాకో ప్లేస్ ఇవ్వండి.. నేనూ ఆడుతా! :  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నాకో ప్లేస్ ఇవ్వండి.. నేనూ ఆడుతా! :  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

‘కూసుమంచి, వెలుగు  : ఏరా పిల్లలు.. వాలీబాల్ ఆడుతున్నట్టున్నరు.. నాకో ప్లేస్ ఇవ్వండి.... నేనూ ఆడుతా’ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  విద్యార్థులతో కాసేపు వాలీబాల్ ​ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. బుధవారం ఆయన కూసుమంచి మండలం గైగోల్లపల్లి గ్రామంలో పర్యటించి పాలేరుకు వస్తుండగా నర్సింహులగూడెం మైదానంలో విద్యార్థులు వాలీబాల్ ఆడటాన్ని గమనించారు.

వెంటనే కాన్వాయ్ ఆపి వారితో కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు. మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వారికి మంత్రి సూచించారు. అనంతరం కొత్త వాలీబాల్, క్రికెట్ ​కిట్​ కొనుక్కోమని వారికి కొంత నగదు ఇచ్చి అక్కడి నుంచి ఆయన బయలుదేరారు.  –