టీడీపీ కాంగ్రెస్ ఒక్కటే.. భవిష్యత్తులో కలిసే ప్రయాణం: మంత్రి పొంగులేటి

టీడీపీ కాంగ్రెస్ ఒక్కటే.. భవిష్యత్తులో కలిసే ప్రయాణం: మంత్రి పొంగులేటి
  • ఇంద్రవెల్లిలో మరో రెండు గ్యారంటీల ప్రకటన
     

ఖమ్మం: టీడీపీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. ఇవాళ న్యూ డెమోక్రసీ ప్రజాపంథా, సీపీఐ, టీడీపీ కార్యాలయాలకు మర్యాద పూర్వకంగా ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాలడుతూ  కాంగ్రెస్  అధికారంలో ఉన్న  చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. భవిష్యత్ రాజకీయాల్లో   కలిసి ప్రయాణం చేద్దామని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో టీడీపీకి ఏమీ లాభం లేకపోయినా ప్రజల అభీష్టం మేరకు  కాంగ్రెస్​కు మద్దతు తెలిపారన్నారు. తెలంగాణ ప్రజలు ఏది కావాలనుకున్నారో అది నెరవేరిందన్నారు. సీపీఐ ఆఫీసులో మాట్లాడుతూ  2న ఇంద్రవెల్లిలో మరో రెండు గ్యారంటీలు ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలకు ఆయన  కృతజ్ఞతలు తెలిపారు.