
భద్రాచలం, వెలుగు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా గురువారం భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుఝామున సుప్రభాత సేవలో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారిసన్నిధిలో వేదపండితులు వారికి వేదాశీర్వచనం ఇచ్చారు. ప్రసాదం, జ్ఞాపిక, శేషమాలికలను అందజేశారు. గోశాలలో గోవులకు ప్రత్యేక పూజలు చేసి గ్రాసం తినిపించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఉన్నారు.
పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు
పాల్వంచ : మండలంలోని కేపీ జగన్నాథపురంలో ఉన్న పెద్ద మ్మ తల్లి దేవాలయంలో మంత్రి పొంగులేటి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీనివాసరెడ్డి పెళ్లిరోజు సందర్భంగా భద్రాచలం నుంచి వెళ్తూ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. కాగా, ఆలయ ఈవో రజనీకుమారి పొంగులేటి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పొంగులేటి సతీమణి కి పసుపు, కుంకుమ, సారె బహూకరించారు.