రమాదేవికి అండగా ఉంటాం : మంత్రి పొన్నం

రమాదేవికి అండగా ఉంటాం : మంత్రి పొన్నం
  •     ప్రియాంక ఇచ్చిన మాటను నిలబెడతాం 
  •     మంత్రి పొన్నం ప్రభాకర్​భరోసా

హుస్నాబాద్​, వెలుగు : హుస్నాబాద్ మండలం కిషన్​నగర్​కు చెందిన జాగిరి రమాదేవి కుటుంబానికి కాంగ్రెస్​ అండగా ఉంటుందని మంతకరి పొన్నం ప్రభాకర్​ భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ తిరిగి వెళ్తూ రమాదేవిని కలిసి.. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే రమాదేవికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు పొన్నం మంగళవారం రమాదేవి ఇంటికి వెళ్లి వారి బాగోగులు తెలుసుకున్నారు. వారికి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని సూచించారు. రమాదేవిని సన్మానించి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లడారు. 
 

మంత్రికి అగ్గిపెట్టెలో పట్టే పట్టువస్త్రం బహూకరణ 
 

కాంగ్రెస్​ హుస్నాబాద్​ పట్టణ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్​ అగ్గిపెట్టెలో పట్టే బంగారుపూత వేసిన పట్టు వస్త్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్​కు బహూకరించారు. మంగళవారం హుస్నాబాద్​లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రిని సన్మానించారు.