బీఆర్ఎస్ప్రణాళిక లేని పాలనతోనే హైదరాబాద్ లో నీటి కష్టాలు

బీఆర్ఎస్ప్రణాళిక లేని పాలనతోనే హైదరాబాద్ లో నీటి కష్టాలు
  • పదేండ్లలో నీళ్లివ్వనోళ్లు అధికారంలోకి రాగానే 24 గంటలు నీళ్లిస్తరట!
  • కేటీఆర్ ​కామెంట్స్​పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా​
  • గత ప్రభుత్వంలో ఒక్క ఎంజీడీ నీళ్లు కూడా తేలేకపోయారు 
  • రూ.7 వేల కోట్లతో గోదావరి ఫేజ్ 2, 3 పనులు చేస్తున్నామని వెల్లడి

హైదరాబాద్​సిటీ, వెలుగు: బీఆర్ఎస్​ప్రభుత్వ పదేండ్ల పాలనలో హైదరాబాద్​నగరానికి ఒక్క ఎంజీడీ నీటిని కూడా అదనంగా తీసుకురాలేకపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కానీ, ఆ పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​మాత్రం అధికారంలోకి రాగానే 24 గంటలు నీళ్లిస్తామని నీటి మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో నగరంలో భవిష్యత్ నీటి సరఫరాపై సరైన ప్రణాళికలేక పోవడం వల్లనే నీటి సమస్యలు వస్తున్నాయన్నారు.

మంగళవారం వాటర్​బోర్డు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి అజారుద్దీన్, బోర్డు ఎండీ అశోక్​రెడ్డి, జేఎండీ మయాంక్​ మిట్టల్, ప్రాజెక్ట్​ డైరెక్టర్​సుదర్శన్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్​ నేతలు కలల ప్రపంచంలో విహరిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతలు నీళ్లు రావట్లేదని వాటర్​బోర్డు ముందు ఉద్దేశపూర్వకంగా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సిటీకి తాగునీటిని అందించేందుకు కాంగ్రెస్​హయాంలోనే అనేక ప్రాజెక్టులు వచ్చాయని గుర్తు చేశారు.

ముఖ్యంగా మంజీరా, సింగూరు, కృష్ణా ప్రాజెక్టు–1, 2,3 దశలతో పాటు గోదావరి మొదటి దశ వరకూ కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో చేపట్టినవేనని వెల్లడించారు. ప్రస్తుతం 7వేల కోట్లతో గోదావరి–2, 3 దశల ప్రాజెక్టు పనులు కూడా కాంగ్రెస్​ ప్రభుత్వం చేపట్టినవేనని అన్నారు. భవిష్యత్​ అవసరాలకు కృష్ణా– 4, 5 దశల ప్రాజెక్టును కూడా కాంగ్రెస్​ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. కోర్​అర్బన్​రీజియన్​ (క్యూర్​) వరకూ విస్తరించిన బోర్డు పరిధిలో ప్రస్తుతం 14.50 లక్షల నీటి కనెక్షన్లకు రోజుకు 560 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో 6.23 లక్షల కనెక్షన్​లకు ఉచిత నీటి సరఫరా జరుగుతోందన్నారు.

నీటి సరఫరా సమస్యలు రాకుండా చర్యలు

గ్రేటర్​ హైదరాబాద్​ ప్రజలకు ఎలాంటి నీటి సమస్యలు రాకుండా మెట్రోవాటర్​బోర్డు ప్రణాళికాబద్ధంగా తాగునీటిని సరఫరా చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్​వివరించారు. నగరంలోడ్రింకింగ్ వాటర్ సమస్యలను, ఫిర్యాదులను ఎప్పటికపుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. గతేడాది అత్యధిక వర్షపాతం నమోదైందని అన్నారు. ఈసారి ఏప్రిల్​, మే నెలల్లో వర్షాలు పడలేదని అన్నారు. అయినా సమ్మర్ లో నీటి సమస్యలు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆన్​లైన్​ ద్వారా ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని దీంతో ఇప్పటికే ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు