బస్సుల్లో మహిళల ఫ్రీ జర్నీకి పెరుగుతున్న రద్దీ కారణంగా 275 బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డిసెంబర్ లో 80 బస్సులు ప్రారంభించాం..ఇపుడు మరో 275 బస్సులు కొనుగోలు చేస్తున్నాం..వీటికి అదనంగా జూలై చివరి నాటికి మరో 1000 కొత్త బస్సులు నడుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీని బలోపేతంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహాలక్ష్మి పథకం అమలు చేశామని తెలిపారు. మహిళలకు ఫ్రీ జర్నీ పథకానికి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. ఇప్పటి వరకు 9 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.