తెలంగాణ బాగుండాలని రాజన్నను వేడుకున్నా: మంత్రి పొన్నం

తెలంగాణ బాగుండాలని రాజన్నను వేడుకున్నా: మంత్రి పొన్నం

తెలంగాణలో అత్యధింగా భక్తులు వచ్చే టెంపుల్ వేములవాడేనని..  మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్న ఆలయాన్ని మంత్రి పొన్నం సందర్శించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‎కు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజన్నకు మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను రాజన్న భక్తుడిని,  దక్షిణ కాశి వేములవాడ అని అన్నారు. వేద పండితుల, శృంగేరి పీఠాధిపతుల అనుమతితో త్వరలోనే ఆలయ అభివృద్ధికి పునాదులు వేస్తామన్నారు.

Also Read :- ఆక్రమణ లెక్క తేలాలి..ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు

రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదానం చేయాలని ఆలోచన చేస్తామని.. తిరుమల లాగా శాశ్వత అన్నదానం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. సీఎంకు చిరకాల జ్ఞాపకం కోసం నేను, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‎తో కలిసి శాశ్వత అన్నదానం ఏర్పాటు చేస్తామన్నారు. కోడెల రక్షణపై సీఎం ఆదేశాలతో గోశాల ఆధునీకరణ చేస్తున్నామని.. భక్తుల సౌకర్యాల కోసం వసతి గదుల నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు.-- తెలంగాణ మంచి వర్షాలతో బాగుండాలని రాజన్నను వేడుకున్నానని అన్నారు.