ఇది అసెంబ్లీ కాదు.. మైక్ ఇవ్వను

ఇది అసెంబ్లీ కాదు.. మైక్ ఇవ్వను

భట్టితో మంత్రి పువ్వాడ

మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురంలోని మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయంలో100 బెడ్స్ తో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్​ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు, మంత్రి అజయ్ కి మధ్య ఆసక్తికర చర్చసాగింది. ముందుగా మాట్లాడిన  భట్టి విక్రమార్క మధిర సివిల్ హాస్పిటల్​లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని మంత్రిని కోరారు. ఆ తర్వాత మాట్లాడిన మంత్రి అజయ్ గత ప్రభుత్వాలు వారసత్వాలుగా అనేక సమస్యలను ఇచ్చాయని.. పరోక్షంగా కాంగ్రెస్ పాలనను విమర్శించారు. అంతలోకి భట్టి కల్పించుకుని తాను మాట్లాడతానని, మైక్ ఇవ్వాలని కోరగా.. ‘మీరు మాట్లాడటం అయిపోయిన తర్వాతే నేను మాట్లాడుతున్నా.. మళ్లీ మైక్ ఇవ్వడం సాధ్యం కాదు. ఇది అసెంబ్లీ కాదు’ అని నవ్వుతూ అజయ్​జవాబు ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ చైర్మన్ లత, డీఎంహెచ్ఓ మాలతి తదితరులు పాల్గొన్నారు.