ఒకేరోజు 60కిపైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబిత

ఒకేరోజు 60కిపైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబిత

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒకే రోజు తన నియోజకవర్గంలో 60కిపైగా శంకుస్థాపనలు చేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం రోజు (ఆగస్టు 27న) 60కి పైగా శంకుస్థాపనలు చేశారు. రూ.12 కోట్ల 38 లక్షల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తొమ్మిది వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్పొరేషన్ పరిధిలోని 1, 2, 3, 4, 5, 22, 24, 26, 30 డివిజన్లలో వరుసగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రత్యేక విజన్ తో నియోజకవర్గంపై ఉన్న పూర్తి అవగాహనతో మంత్రి సబిత వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని కార్పొరేటర్లు చెప్పారు.