మంత్రి సబితా గన్మెన్ ఆత్మహత్య..లోన్ వేధింపులే కారణమా.?

మంత్రి సబితా  గన్మెన్ ఆత్మహత్య..లోన్ వేధింపులే కారణమా.?

 మంత్రి సబితాఇంద్రారెడ్డి గన్ మెన్, ARSI ఫాజిల్ సూసైడ్  చేసుకున్నాడు. గన్ తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్లో ఘటన జరిగింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంజారాహిల్స్ పోలీసులు హోటల్ ను పరిశీలించి ఆధారాలు సేకరించారు.

నవంబర్ 5న ఉదయం 6 గంటలకు ఫాజిల్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్. ఆర్థిక సమస్యలతోనే సూసైడ్ చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న ఫాజిల్ ఉదయం  రిలీవింగ్ ఇచ్చి హోటల్ కు వెళ్లాడని తెలిపారు. కూతురిని కూడా హోటల్ కు తీసుకొచ్చాడని.. ఆమెతో మాట్లాడి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు జోయెల్ డేవిస్. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.