మంత్రి సబితా వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.. ఆమె పర్సును కూడా వదల్లేదు

మంత్రి సబితా వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.. ఆమె పర్సును కూడా వదల్లేదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వాహన తనఖీల్లో అధికారులు ఎవరినీ విడిచిపెట్టడం లేదు. 

తాజాగా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద ఆమెను ఆపిన పోలీసులు వాహనాలతో పాటు, ఆమె పర్సును కూడా వదలకుండా చెక్ చేశారు. 

గురువారం(నవంబర్ 02) నాడు ప్రచార రథాలను ప్రారంభించి వెళ్తుండగా.. మంత్రి కాన్వాయ్ ని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో మంత్రి సబితా తన వాహనం దిగి పోలీసుల తనిఖీకి పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆమె వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీ అనంతరం మంత్రి సబితా అక్కడి నుంచి బయలుదేరారు.