నిజామాబాద్, వెలుగు: శ్రమజీవులందరికీ మేలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాల చట్టాన్ని ప్రకటించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క తెలిపారు. అందులో భాగంగా హమాలీల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నిజామాబాద్మార్కెట్కమిటీలో రూ.6.56 కోట్లతో నిర్మించనున్న షెడ్లు, మడిగెలు, సోలార్ ప్లాంట్పనులకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ఉమారాణితో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అడిషనల్ కలెక్టర్ వి.భుజంగరావు, మున్సిపల్ కమిషనర్దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తండాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నం
మారుమాల గిరిజన తండాలంన్నిటినీ అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. ఇందల్వాయి మండలంలోని రాంపూర్ తండా నుంచి వెంగల్పాడ్తండా వరకు రూ.5.48 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. కేకే తండా నుంచి మెగ్యానాయక్ తండా వరకు రూ.2.94 కోట్లతో నిర్మించే రోడ్డు పనులను ప్రారంభించారు. తిర్మన్పల్లి గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో నిర్మించిన హాస్టల్, డైనింగ్హాల్ను ప్రారంభించారు. ఉర్దూ అకాడెమీ చైర్మన్ తాహెర్, అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఆర్టీవో రాజేంద్రకుమార్, డీపీవో శ్రీనివాస్రావు తదితరులు ఉన్నారు.
