కల్తీ విత్తనాల విషయంలో ఉక్కుపాదం మోపాం: మంత్రిశ్రీధర్ బాబు

కల్తీ విత్తనాల విషయంలో ఉక్కుపాదం మోపాం: మంత్రిశ్రీధర్ బాబు

కరీంనగర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై  మంత్రి శ్రీధర్​ బాబు రివ్యూ  సమీక్ష నిర్వహించారు.  జిల్లాలో పెండింగ్ పనులు, అభివృద్ధి ప్రతిపాదనలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్​ బాబు  మాట్లాడుతూ.. రైతులు  హార్టీకల్చర్​ సాగుపై దృష్టి సారించాలని.. ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు.  కల్తీ విత్తనాల విషయంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఉన్న ప్రజా పాలనలో విద్య,  వైద్యం, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్​ ఇచ్చామన్నారు.  ప్రభుత్వ పాఠశాలల విషయంలో విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామని... ఏ విషయంలోనైనా క్వాలిటి విషయం రాజీపడమంటూ... పేదలు.. రైతుల అభివృద్ది విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు.   రాజకీయాలకి అతీతంగా‌ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నామని మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. 

►ALSO READ | ఈ లిస్ట్ చూడండి ఎంతుందో.. ఒకే స్కూటీపై 233 చలాన్లు.. ఫైన్ ఎంతో తెలుసా..?