
కరీంనగర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి శ్రీధర్ బాబు రివ్యూ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ పనులు, అభివృద్ధి ప్రతిపాదనలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రైతులు హార్టీకల్చర్ సాగుపై దృష్టి సారించాలని.. ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు. కల్తీ విత్తనాల విషయంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ప్రజా పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలల విషయంలో విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామని... ఏ విషయంలోనైనా క్వాలిటి విషయం రాజీపడమంటూ... పేదలు.. రైతుల అభివృద్ది విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. రాజకీయాలకి అతీతంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
►ALSO READ | ఈ లిస్ట్ చూడండి ఎంతుందో.. ఒకే స్కూటీపై 233 చలాన్లు.. ఫైన్ ఎంతో తెలుసా..?