
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘జెడ్డా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ రోడ్షోలో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్బాబు శనివారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఉదయం 9 గంటలకు సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో సమావేశమవుతారు.
10 గంటలకు జెడ్డా ఛాంబర్స్తో మీటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆహార ఉత్పత్తుల దిగ్గజ సంస్థ సవోలా గ్రూప్ సీఈవో వలీద్ ఫతానాతో మంత్రి చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ సీఈవో, బోర్డ్ సభ్యులతో సమావేశమవుతారు. ఆ తర్వాత పెట్రోమిన్ కార్పొరేషన్ హెడ్క్వార్టర్స్ సందర్శించి ఆ సంస్థ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చిస్తారు. ఆ తర్వాత బట్టర్జీ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ మాజెన్ బెట్టర్జీతోపాటు అరామ్కో సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు షెరటన్ హోటల్ లో నిర్వహించే ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ రోడ్ షోలో మంత్రి పాల్గొంటారు.