పీసీబీ హెడ్డాఫీసులో మంత్రి సురేఖ ఆకస్మిక తనిఖీలు

పీసీబీ హెడ్డాఫీసులో మంత్రి సురేఖ ఆకస్మిక తనిఖీలు

జీడిమెట్ల, వెలుగు: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(పీసీబీ) ఆఫీసర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు  కృషి చేయాలని పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం ఆమె సనత్ నగర్ లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి  కేంద్ర కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు.

మంత్రి మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది తమ విధుల్లో  నిర్లక్ష్యం వహించవద్దని కోరారు.  కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు పరచాలని సూచించారు. ఈ సందర్భంగా అమె పలు  ఫైళ్లను, సిబ్బంది హజరు పట్టికను పరిశీలించారు.