తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీలో పాల్గొన్న మంత్రులు

తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీలో పాల్గొన్న మంత్రులు

టీఆర్ఎస్ నేతలు అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ర్యాలీని ప్రారంభించారు. అమీర్ పేట లోని కనకదుర్గమ్మ దేవాలయం నుండి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. 

మరోవైపు ఐ మ్యాక్స్ చౌరస్తా నుంచి పీపుల్స్ ప్లాజా వరకు గ్రేటర్ టీఆర్ఎస్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంబించారు. ర్యాలీలో విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. నగరంలో  తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకలకు హోంమంత్రి మహ్మద్ అలీతో పాటు, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు.