మోడీ ఫ్యాషన్ షో తప్ప చేసిందేమి లేదు

మోడీ ఫ్యాషన్ షో తప్ప చేసిందేమి లేదు

బీజేపీ సైన్యాన్ని కూడా  రాజకీయాల్లోకి లాగుతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పుల్వా ఘటనను, సర్జికల్ స్ట్రైక్ ను కూడా రాజకీయాల కోసం వాడుకుందన్నారు. కేంద్రమంత్రులు బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా? బుద్ధి లేక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదన్నారు. కిషన్ రెడ్డి యుద్దం చేస్తడంటా? మీ శక్తి ఎంత.. జాగ్రత్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని తలసాని అన్నారు . సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడైనా లక్ష రూపాయల అభివృద్ధి చేశారా? అని ప్రశ్నించారు. హైదరాబదాద్ లో వరదలు వచ్చినప్పుడు కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకరాలేదన్నారు. వరదలు వచ్చినప్పుడు పొలిటికల్ డ్రామాలాడారన్నారు. మూడేళ్లలో సికింద్రాబాద్ కు ఏం చేశారో చెప్పాలన్నారు.  బీజేపీ నేతలు బండిపోతే బండి కారు పోతే కారు ఇస్తామన్నారు.   బీజేపీ నాయకులకు మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప వేరొకటి తెలియదన్నారు.

బీజేపీ నేతలకు ఈక్వాలిటీ అర్థం తెలుసా? అని తలసాని ప్రశ్నించారు.  మోడీ ఫ్యాషన్ షో గురించి చెప్పుకోవడం తప్ప చేసిందేమి లేదన్నారు.  కాంగ్రెస్ గురించి ఆలోచించే శక్తి దేశ ప్రజలకు లేదన్నారు. సీఎం కేసీఆర్ లాంటి పాలన దేశంలో ఎక్కడైనా జరిగితే చర్చకు సిద్ధమన్నారు. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా చర్చను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమన్నారు. నోరు జారితే ఏకంగా ప్రధానమంత్రి నుంచే స్టార్ట్ చేస్తమన్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి కూడా సిద్దమన్నారు. నన్ను చూడు నా అందం చూడన్నట్లుగా బీజేపీ పరిపాలన ఉందన్నారు.   మోడీకి ఈక్వాలిటీ అర్థం తెలుసా అని ప్రశ్నించారు. రామానుజచార్యుల విగ్రహావిష్కరణకు పోవడమే మోడీ చేసిన పెద్ద తప్పన్నారు. దేశంలో కాంగ్రెస్ కు అతిలేదు గతిలేదన్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామని ఎక్కాడా చెప్పలేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.