హైదరాబాద్: శారీరక దృఢత్వం, మానసికోల్లాసానికి క్రీడలు ఉపయోగపడతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని గురుమూర్తి క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపు ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంపులో చేరిన పిల్లలకు క్రికెట్, బాస్కెట్ బాల్, వాలీబాల్ కిట్లను అందజేశారు. అనంతరం బేగంపేట్ లోని బూర్గుల రామక్రిష్ణ స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించారు. ఈ సందర్ఆయన మాట్లాడుతూ... సమ్మర్ క్యాంపును వినియోగించుకోవాలని సూచించారు. వేసవిలో సమయాన్ని వృధా చేయకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. ఫిట్ గా ఉంటే ఎలాంటి వ్యాధులనైనా జయించవచ్చని తెలిపారు.
Inaugurated Burgula Rama Krishna swimming pool at SP Road in Begumpet Division. pic.twitter.com/bqLxDfvXLq
— Talasani Srinivas Yadav (@YadavTalasani) May 13, 2022
మరిన్ని వార్తల కోసం...