విద్యార్థులు క్రీడల్లో రాణించాలి:తలసాని శ్రీనివాస్ 

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి:తలసాని శ్రీనివాస్ 

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో రాణించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ప్రైవేటుగుర్తింపు పొందిన పాఠశాల విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.ఈ స్పోర్ట్స్ మీట్ లో వెయ్యికి పైగా  విద్యార్థులు పాల్గొన్నారు.  

నిరంతరం తరగతి గదులు, పరీక్షలకు సిద్ధం కావడం వంటి వత్తిడుల నుండి విద్యార్థులకు క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్  అన్నారు. ఈ పోటీలు మూడు రోజులపాటు  క్రికెట్, కబడ్డీ, కోకో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించే విధంగా పోటీలను నిర్వహించడం పట్ల స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ను మంత్రి తలసాని అభినందించారు.