అభివృద్ధి పనులు ఇన్​టైంలో పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 అభివృద్ధి పనులు ఇన్​టైంలో పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని 46వ డివిజన్, జూబ్లీపురాలో 33.95 లక్షల మున్సిపల్ నిధులతో నిర్మించనున్న సీసీ డ్రైన్స్, కల్వర్ట్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అధికారులతో పాటు ప్రజలపై ఉందన్నారు. అభివృద్ధి పనుల్లో లోటుపాట్లు ఉంటే కమిషనర్ దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్​రెడ్డి, 46వ డివిజన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.